ఉద్యోగులకు కేసీఆర్‌ వెన్నుపోటు పొడుస్తున్నారు: వంశీచంద్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-06-04T05:30:00+05:30 IST

ఉద్యోగులకు కేసీఆర్‌ వెన్నుపోటు పొడుస్తున్నారని కాంగ్రెస్ నేత వంశీచంద్‌రెడ్డి అన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరిస్థితి

ఉద్యోగులకు కేసీఆర్‌ వెన్నుపోటు పొడుస్తున్నారు: వంశీచంద్‌రెడ్డి

హైదరాబాద్‌: ఉద్యోగులకు కేసీఆర్‌ వెన్నుపోటు పొడుస్తున్నారని కాంగ్రెస్ నేత వంశీచంద్‌రెడ్డి అన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ప్రభుత్వానికి ఎందుకు వారిపై కక్ష అని ప్రశ్నించారు. స్వామిగౌడ్‌కు కౌన్సిల్‌ చైర్మన్‌ పదవి దక్కింది కానీ పీఆర్సీ రాలేదని చెప్పారు. ఉద్యోగ పదవీ విరమణ వయస్సును 61కి పెంచుతామన్నారు.. కానీ పెంచలేదని విమర్శించారు. ఉద్యగ సంఘాల నాయకులు ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. తాయిలాలు ఇచ్చి ప్రభుత్వం వారిని లోబర్చుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-06-04T05:30:00+05:30 IST