ప్రజా శ్రేయస్సే నా లక్ష్యం: వనమా

ABN , First Publish Date - 2020-12-01T05:06:41+05:30 IST

ప్రజలకు సేవ చేయడమే ధ్యేయంగా, అభివృద్ధే లక్ష్యంగా తాను పని చేస్తున్నానని, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు.

ప్రజా శ్రేయస్సే నా లక్ష్యం: వనమా

పాల్వంచ టౌన్‌, నవంబరు 30: ప్రజలకు సేవ చేయడమే ధ్యేయంగా, అభివృద్ధే లక్ష్యంగా తాను పని చేస్తున్నానని, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. పట్టణ పరిధిలో సోమవారం విస్తృతంగా పర్యటించి సుమారు రూ.70లక్షల మేర అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. పాల్వంచ మునిసిపల్‌ కమిషనర్‌ చింత శ్రీకాంత్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వార్డు మెంబర్‌ నుంచి సర్పంచ్‌గా మునిసిపల్‌ చైర్మన్‌గా, నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసి ప్రజలతోనే తన జీవిత ప్రయాణం సాగిందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌, కొత్వాల శ్రీనివాసరావు, డీఈ కే. మురళీ, ఏఈ కే. రాజేష్‌, సొసైటీ చైర్మన్‌ కాంపెల్లి కనకేష్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షులు ముంతపురి రాజుగౌడ్‌, నాయకులు కాల్వ భాస్కర్‌రావు, దాసరి నాగేశ్వరరావు, బండి చిన వెంకటేశ్వర్లు, చింతనాగరాజు, కాలనీ వాసులు ఎన్‌. రవి నాయక్‌, పి. వెంకటేశ్వర్లు, వేణుగోపాల్‌, లక్ష్మణ్‌, సర్వర్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-01T05:06:41+05:30 IST