30న వూహాన్‌కు ‘వందే భారత్‌’ విమానం

ABN , First Publish Date - 2020-10-24T11:47:53+05:30 IST

కరోనా మహమ్మారికి పుట్టినిల్లైన చైనాలోని వూహాన్‌లో చిక్కుకున్న భారతీయులను భారత్‌ స్వదేశానికి తీసుకువెళ్లనుంది. వందే భారత్‌ మిషన్‌లో భాగంగా ఈ నెల 30న ఢిల్లీ నుంచి ఎయిరిండియా విమానం వూహాన్‌కు చేరుకో

30న వూహాన్‌కు ‘వందే భారత్‌’ విమానం

బీజింగ్‌, అక్టోబరు 23: కరోనా మహమ్మారికి పుట్టినిల్లైన చైనాలోని వూహాన్‌లో చిక్కుకున్న భారతీయులను భారత్‌ స్వదేశానికి తీసుకువెళ్లనుంది. వందే భారత్‌ మిషన్‌లో భాగంగా ఈ నెల 30న ఢిల్లీ నుంచి ఎయిరిండియా విమానం వూహాన్‌కు చేరుకోనుందని ఇక్కడి భారత రాయబార కార్యాలయం తెలిపింది. వివరాలకు helpdesk.beijing@mea.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించాలని పేర్కొంది.  

Updated Date - 2020-10-24T11:47:53+05:30 IST