వీబీఎం: స్వదేశానికి చేరిన 20లక్షల మంది భారతీయులు!

ABN , First Publish Date - 2020-10-24T15:49:36+05:30 IST

లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించడం కోసం ప్రారంభించిన ‘వందే భారత్ మిషన్’ కొనసాగుతోందని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్

వీబీఎం: స్వదేశానికి చేరిన 20లక్షల మంది భారతీయులు!

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించడం కోసం ప్రారంభించిన ‘వందే భారత్ మిషన్’ కొనసాగుతోందని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. ఈ మిషన్‌లో భాగంగా నిన్న ఒక్కరోజే 6,049 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారని తెలిపారు. వీబీఎంలో భాగంగా ఇప్పటి వరకు ఇండియాకు చేరిన వారి సంఖ్య 20లక్షలు దాటిందని ట్విట్టర్ ద్వారా వివరించారు. కాగా.. భారత ప్రభుత్వం వందే భారత్ మిషన్‌ను మే 7 ప్రారంభించింది. అక్టోబర్ 1 నుంచి ఈ మిషన్ ఏడో దశలోకి ప్రవేశించింది. ఏడో విడత ‘వందే భారత్ మిషన్’ కోసం 1,050 అంతర్జాతీయ విమానాలను 20 దేశాలకు నడిపేందుకు ప్రభుత్వం  ఏర్పాట్లు చేసింది. ఇందులో 690 విమానాలు సుమారు 1.30 లక్షల మంది భారతీయులను.. వివిధ దేశాల నుంచి వెనక్కి తీసుకొచ్చాయి. 

Updated Date - 2020-10-24T15:49:36+05:30 IST