మహిళలకు ఏం చేశారో చర్చకు సిద్ధమా: అనిత
ABN , First Publish Date - 2021-03-08T10:32:04+05:30 IST
‘‘ముఖ్యమంత్రిగారూ.. మీ 21 నెలల పాలనలో మహిళలకు జరిగిన న్యాయం ఒక్కటైనా ఉందా? మీ పాలనలో మహిళలు ఏనాడైనా ప్రశాంతంగా
అమరావతి, మార్చి 7(ఆంధ్రజ్యోతి): ‘‘ముఖ్యమంత్రిగారూ.. మీ 21 నెలల పాలనలో మహిళలకు జరిగిన న్యాయం ఒక్కటైనా ఉందా? మీ పాలనలో మహిళలు ఏనాడైనా ప్రశాంతంగా ఉండటం మీరు చూశారా? మీ పాలనలో మహిళలకు జరిగిన అన్యాయాలపై బహిరంగంగా చర్చించడానికి సాక్ష్యాధారాలతో అమరావతి వేదికగా నేను సిద్ధం’’ అని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత సవాల్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్కు ఆమె బహిరంగ లేఖ రాశారు. గత ప్రభుత్వం పుణ్యమా అంటూ మహిళలు తలెత్తుకొని, బతికితే.. జగన్ పుణ్యమా అంటూ మహిళలు ఇంటికే పరిమితమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో మహిళలు బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అడపడుచులకు ఇంత క్షోభ మిగిల్చిన జగన్రెడ్డికి మహిళా దినోత్సవం జరుపుకొనే హక్కు లేదన్నారు.