సూపర్ హోం మినిస్టర్ మీడియా ముందుకు రారు: అనిత

ABN , First Publish Date - 2021-09-18T23:28:46+05:30 IST

సూపర్ హోం మినిస్టర్ మీడియా ముందుకు రారు: అనిత

సూపర్ హోం మినిస్టర్ మీడియా ముందుకు రారు: అనిత

అమరావతి: ఆడబిడ్డలను చంపినా, హత్యలు, అత్యాచారాలు జరిగినా సూపర్ హోం మినిస్టర్  మీడియా ముందుకు రారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వంగలపూడి అనిత అన్నారు. జగన్‌ను ఎవరైనా ఓ మాట అంటే స్క్రిప్టు పట్టకుని వస్తారని విమర్శించారు. ఓ పేపరు నుండి వచ్చిన బ్రోకర్ హయాంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పడానికి ఆధారాలు చాలా ఉన్నాయన్నారు. వంగవీటి మోహన్ రంగా హత్య జరిగినప్పుడు చంద్రబాబు సీఎంగా లేరన్నారు. 30 ఏళ్ల నాటి ఘటనలను నెమరేసుకుంటూ.. అప్పుడు శాంతి భద్రతలు లేవని, ఇప్పుడు మేము కాపాడుతున్నామని చెప్పడానికి సిగ్గుండాలన్నారు. అయ్యన్నపాత్రుడు మాట్లాడిన దాంట్లో తప్పులేదన్నారు. ఉన్నపదవికి న్యాయం చేయాల్సింది పోయి ఎవరి అడుగులకో మడుగులొత్తుతూ మోకాళ్ల కింద నీళ్లు తాగడం సిగ్గుమాలిన చర్యన్నారు. లేని దిశ చట్టంతో ముగ్గురికి ఉరిశిక్ష వేసి, 20 మందికిపైగా శిక్షలు వేసామని చెప్పడానికి సిగ్గుందా? అని ఆమె ప్రశ్నించారు. దళిత ఆడబిడ్డను మానబంగం చేసి దిశ స్టేషన్ ముందు వదలి వెళ్తే నీ నోరు ఏమైంది? అని ప్రశ్నించారు. లోకేష్‌ను రోడ్డు మీద తిరగనివ్వనంటున్నారు.. ఆంధ్రా నీయమ్మ మొగుడు జాగీరా? అని అనిత ప్రశ్నించారు.  

Updated Date - 2021-09-18T23:28:46+05:30 IST