నేటి నుంచి మందలపర్రు వంతెనపై రాకపోకలు బంద్
ABN , First Publish Date - 2021-01-27T05:50:14+05:30 IST
మందలపర్రులో చినకాపవరం పంట కాల్వపై వున్న వంతెన శిథిలావస్థ చేరుకోవడంతో పూర్తిగా మూసివేస్తున్నట్టు నిడమర్రు ఎస్ఐ హెచ్.నాగరాజు తెలిపారు.
నిడమర్రు జననవరి 26 : మందలపర్రులో చినకాపవరం పంట కాల్వపై వున్న వంతెన శిథిలావస్థ చేరుకోవడంతో పూర్తిగా మూసివేస్తున్నట్టు నిడమర్రు ఎస్ఐ హెచ్.నాగరాజు తెలిపారు. ఇప్పటికే భారీ వాహనాలు వెళ్లకుండా నిలువరించిన వంతెనకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టడానికి అధికారు లు పనులు ప్రారంభించనున్న దృష్ట్యా బుధవారం నుంచి రాకపోకలు నిషేధి స్తున్నామని అధికారులు తెలిపారు. భారీ వాహనదారులు గణపవరం సెంటర్ నుంచి తాడేపల్లిగూడెం మీదుగా రాకపోకలు సాగించాలని, నారాయణపురం నుంచి తాడేపల్లిగూడెం మీదుగా గణపవరానికి రాకపోకలు రాకపోకలు సాగిం చాలని సూచించారు. గణపవరం నుంచి నారాయణపురం వెళ్లే చిన్న వాహనా లు ఆటోలు, కార్ల వారు అడవికొలను మీదుగా ప్రయాణం సాగించాలన్నారు.