నేడు అప్పన్న కల్యాణ మహోత్సవం

ABN , First Publish Date - 2020-04-04T09:26:02+05:30 IST

వరాహలక్ష్మీనృసింహస్వామి వార్షిక తిరుకల్యాణ మహోత్సవానికి అంకురారోపణంతో అర్చకులు శ్రీకారం చుట్టారు.

నేడు అప్పన్న కల్యాణ మహోత్సవం

అంకురారోపణంతో ఉత్సవాలకు శ్రీకారం.


సింహాచలం: వరాహలక్ష్మీనృసింహస్వామి వార్షిక తిరుకల్యాణ మహోత్సవానికి అంకురారోపణంతో అర్చకులు శ్రీకారం చుట్టారు. శుక్రవారం దేవాలయ స్థానాచార్యులు టీపీ రాజగోపాల్‌ పర్యవేక్షణలో ఉపప్రధానార్చకులు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు సారథ్యంలో ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థానం ఈవో వెంకటేశ్వరరావు, ఏఈవో పులి రామారావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. శనివారం జరుగునున్న వార్షిక తిరుకల్యాణ మహోత్సవానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

Updated Date - 2020-04-04T09:26:02+05:30 IST