భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం
ABN , First Publish Date - 2020-08-15T10:15:31+05:30 IST
శ్రావణమాసం చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని మొదటి రోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయ హరిహరసుత అయ్యప్పస్వామి దేవాలయంలో వరలక్ష్మీ వ్ర
అనంతపురం టౌన్, ఆగస్టు 14 : శ్రావణమాసం చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని మొదటి రోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయ హరిహరసుత అయ్యప్పస్వామి దేవాలయంలో వరలక్ష్మీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రుత్వికులు వేదమంత్రాలు వల్లించడంతోపాటు వ్రత విశిష్టతను వివరిస్తూ వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
వ్రతాన్ని కేవలం ఆలయ కార్యవర్గం, అర్చక బృందం సమక్షంలో మాత్రమే నిర్వహించారు. కార్యక్రమంలో ఆల య ఈఓ సుధారాణి, ప్రకాష్, రామ్మోహన్, ప్రధానార్చకు డు నరసింహశాస్త్రి, కిశోర్, సుబ్బు, సాయి పాల్గొన్నారు.