విజయసాయిరెడ్డికి చింత చచ్చినా పులుపు చావలేదు: వర్ల రామయ్య

ABN , First Publish Date - 2020-08-10T21:02:26+05:30 IST

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి చింత చచ్చినా పులుపు చావలేందంటూ ట్విట్టర్ వేదికగా టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయసాయిరెడ్డికి చింత చచ్చినా పులుపు చావలేదు: వర్ల రామయ్య

అమరావతి: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి చింత చచ్చినా పులుపు చావలేందంటూ ట్విట్టర్ వేదికగా టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. చార్మినార్ కట్టింది టీడీపీ అధినేత చంద్రబాబు కాదని.. అయితే హైదరాబాద్‌ను సర్వతోముఖాభివృద్ధి చేసింది మాత్రం చంద్రబాబేనన్నారు. ‘‘విజయసాయి రెడ్డి గారూ! మీకు ‘చింత చచ్చినా పులుపు చావలేదు’. చార్మినార్ కట్టింది చంద్రబాబు కాదు. హైటెక్ సిటీ కట్టింది, సైబరాబాద్ నిర్మించింది, హైదరాబాద్‌ను సర్వతోముఖాభివృద్ధి చేసింది మాత్రం చంద్రబాబే అని ప్రపంచమంతా తెలుసు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి సాధించారో చెప్పండి?’’ అని వర్ల రామయ్య ప్రశ్నించారు.

Updated Date - 2020-08-10T21:02:26+05:30 IST