అడిషినల్ ఎస్పీపై చర్యలు తీసుకోవాలని గవర్నర్కు వర్ల లేఖ
ABN , First Publish Date - 2021-06-22T16:21:37+05:30 IST
గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్కు టీడీపీ జాతీయ కార్యదర్శి వర్ల రామయ్య లేఖ రాశారు. సీఐడీ అధికారి
అమరావతి: గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్కు టీడీపీ జాతీయ కార్యదర్శి వర్ల రామయ్య లేఖ రాశారు. సీఐడీ అధికారి పీవీ.సునీల్కుమార్, అడిషినల్ ఎస్పీ సత్తిబాబుపై చర్యలు తీసుకోవాలన్నారు. ఉగ్రవాదులను ఆదర్శంగా తీసుకోవాలంటూ యువతకు పిలుపునిస్తున్నారు. ఇరువురిపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. ఉగ్రవాదుల చర్యను సమర్ధించిన ఇరువురిపై రాజద్రోహం కేసు పెట్టాలని వర్ల డిమాండ్ చేశారు.