‘ఆ పేరెత్తితే జగన్ ఎందుకు వణుకుతున్నారు’

ABN , First Publish Date - 2020-02-23T02:06:03+05:30 IST

రస్ అల్ ఖైమా కేసుపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మౌనం వీడాలని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఇవాళ టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

‘ఆ పేరెత్తితే జగన్ ఎందుకు వణుకుతున్నారు’

అమరావతి : రస్ అల్ ఖైమా కేసుపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మౌనం వీడాలని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఇవాళ టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.


జగన్‌కి ఎవరు సలహా ఇస్తున్నారో..!

మౌనం అర్ధ అంగీకరం అనుకోవాలా? లేక పూర్ణాంగీకరం అనుకోవాలా?. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మహిళ ముఖ్యమంత్రిని చూడాలని పొట్లూరి వీరప్రసాద్ ట్వీట్ చేశారు. పీవీపీ ట్వీట్ ఎందుకు తొలగించారో సమాధానం చెప్పాలి. జగన్‌కి ఎవరు సలహా ఇస్తున్నారో తెలియదుగానీ చెత్త సలహా ఇస్తున్నారు. రస్ అల్ ఖైమా దేశం అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డిగారు వణుకుతున్నారు. దీనిపై జగన్‌కి ధైర్యం ఉంటే మీడియా సమావేశం పెట్టాలి. కేంద్రం ప్రభుత్వం జనవరి 17, 2020న విడుదల చేసిన గేజిట్ నోటిఫికేషన్‌తో జగ‌న్ వెన్నులో చలి మొదలైంది. నిమ్మగడ్డ ప్రసాద్ మీ కంపెనీలో రూ.854 కోట్లు పెట్టుబడి పెట్టిన మాట వాస్తవం కాదా?. రస్ అల్ ఖైమా మన ముఖ్యమంత్రిని వాళ్ల దేశానికి తీసుకెళ్తారా లేదా ఇక్కడ ఉంచుతారా..? అని రాష్ట్ర ప్రజలు ఆతురతతో చూస్తున్నారు. నిమ్మగడ్డ ప్రసాద్ 7 నెలల నుంచి సెర్బియాలో ఉంటే మీరు ఏమి చేశారు సార్. మీ తరుపున ఎంత మంది అడ్వకేటర్స్ సెర్బియాకు, రస్ అల్ ఖైమా వెళ్లారో సమాధానం చెప్పాలి’ అని వర్ల డిమాండ్ చేశారు.

Updated Date - 2020-02-23T02:06:03+05:30 IST