వార్షికోత్సవ సంచిక ఆవిష్కరణ

ABN , First Publish Date - 2021-04-14T06:28:27+05:30 IST

సూరన సారస్వత సంఘం నంద్యాలలో 4 దశాబ్దాలుగా సాహిత్యసేవ పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు.

వార్షికోత్సవ సంచిక ఆవిష్కరణ

నంద్యాల(కల్చరల్‌), ఏప్రిల్‌ 13: సూరన సారస్వత సంఘం నంద్యాలలో 4 దశాబ్దాలుగా సాహిత్యసేవ పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. మంగళవారం సాయంత్రం గీతాభవన్‌లో సంస్థ అధ్యక్షుడు డాక్టర్‌ గెలివి సహదేవుడు ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత సంస్థ కార్యదర్శి సుబ్రహ్మణ్య శాస్ర్తి రచించిన ఈ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. ఈ సంచికలో సంస్ధ 40 సంవత్సరాలుగా నిర్వహించిన పలు సాహితీ కార్యక్రమాల వివరాలను పొందుపరిచారు. ఈ సంస్థ ద్వారా ఇప్పటికి 250కి పైగా సాహిత్య ఉపన్యాసాలు, అవధానాలు, గ్రంఽథావిష్కరణలు, కవి సమ్మేళనాలు నిర్వహించారన్నారు. సంచికను ప్రముఖ స్వర్ణ వర్తకులు భవనాశి శ్రీనివాసులు, భవనాశి నాగమహేశ్‌లు ఆవిష్కరించారు. కవులు అన్నెం శ్రీనివాసరెడ్డి, డాక్టర్‌ కిషోర్‌కుమార్‌, సాహిత్య ప్రియులు పాల్గొన్నారు.   

Updated Date - 2021-04-14T06:28:27+05:30 IST