వాసవీమాత వసంతోత్సవం

ABN , First Publish Date - 2021-10-18T04:52:43+05:30 IST

దసరా శరన్నవరాత్రిలో భాగంగా వాసవీ కన్యకా పరమేశ్వరిదేవి ఆలయంలోని అమ్మవారిశాలలో నిర్వహించే దసరా శరన్నవరాత్రులు ముగింపు రోజున ఆర్యవైశ్యులు వసంతోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు.

వాసవీమాత వసంతోత్సవం
రంగులు చల్లుకుంటున్న చిన్నారులు, పెద్దలు

బేతంచెర్ల, అక్టోబరు 17:  దసరా శరన్నవరాత్రిలో భాగంగా వాసవీ కన్యకా పరమేశ్వరిదేవి  ఆలయంలోని అమ్మవారిశాలలో నిర్వహించే దసరా  శరన్నవరాత్రులు ముగింపు రోజున ఆర్యవైశ్యులు వసంతోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేక వాహనంలో ప్రతిష్ఠిచి అమ్మవారిశాల నుంచి పట్టణవీధల గుండా ఊరేగింపుగా తీసుకెళ్తూ రంగుల బండిలోని రంగులు ఒకరిపై ఒకరు చల్లుకున్నారు. ఇందులో పెద్దలు,  పిల్లలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు  పాల్గొన్నారు.


Updated Date - 2021-10-18T04:52:43+05:30 IST