28న కొర్నెపాడులో రైతులకు శిక్షణ
ABN , First Publish Date - 2021-02-24T05:57:01+05:30 IST
వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడులో ఈనెల 28 ఆదివారం ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ విధానంలో చెరుకుసాగు, చెరుకు రసం, బెల్లం తయారీలపై శిక్షణ ఇస్తున్నట్లు రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు.
గుంటూరు, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడులో ఈనెల 28 ఆదివారం ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ విధానంలో చెరుకుసాగు, చెరుకు రసం, బెల్లం తయారీలపై శిక్షణ ఇస్తున్నట్లు రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఖమ్మం జిల్లా రైతు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు శిక్షణ ఇస్తారు. హాజరయ్యే వారు 9705383666, 0863- 2286255కు ఫోన్చేసి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.