మంత్రి సబితారెడ్డిని కలిసిన వీడీడీఎఫ్ బృందం
ABN , First Publish Date - 2021-08-04T04:59:23+05:30 IST
మంత్రి సబితారెడ్డిని కలిసిన వీడీడీఎఫ్ బృందం
వికారాబాద్,(ఆంధ్రజ్యోతి)/వికారాబాద్/బంట్వారం: వికారాబాద్, పరిగిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు అభినందనీ యమని వీడీడీఎఫ్ ప్రతినిధులు మంగళవారం రాత్రి హైదరాబాద్లో రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా వికారాబాద్లో ఎమ్మెల్యే ఆనంద్ను కలిసి ఆయన కృషికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వీడీడీఎఫ్ ప్రతినిధులు శ్రీనివాస్, శుభప్రద్ పటేల్, దేవదాస్, మాణిక్రెడ్డి, మారుతి, దేవదాస్, ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా అదేవిధంగా బంట్వారంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గంచెర్వు మల్లేశంలు మంగళవారం మండల పార్టీ సమావేశంలో డిగ్రీ కళాశాలల ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేశారు. సీఎం, మంత్రులతో పాటు, ఎమ్మెల్యే ఆనంద్కు ధన్యవాదాలు తెలిపారు.