కాయగూరల మార్కెట్‌లో వాణిజ్య సమూదాయాల తొలగింపు

ABN , First Publish Date - 2021-10-22T06:01:59+05:30 IST

పట్టణంలోని కాయగూరల మార్కెట్‌ అభివృద్ధిలో భాగంగా వాణిజ్యసమూదాయాలను మున్సిపల్‌ అధికా రులు తొలగింపచేశారు.

కాయగూరల మార్కెట్‌లో వాణిజ్య సమూదాయాల తొలగింపు

ధర్మవరం, అక్టోబరు 21: పట్టణంలోని కాయగూరల మార్కెట్‌ అభివృద్ధిలో భాగంగా వాణిజ్యసమూదాయాలను మున్సిపల్‌ అధికా రులు తొలగింపచేశారు. పట్టణంలోని కూరగాయల మార్కెట్‌ను అత్యాఽధునిక హుంగులతో నూతనంగా నిర్మించనున్నారు. ఇందులో భాగంగా గురువారం మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున ఆధ్వర్యంలో  ఆర్వోఆనంద్‌, ఆర్‌ఐరవి, టీపీఎస్‌ నాగవల్లిలు పోలీసు బందోబస్తు మధ్య వాణిజ్యసమూదాయాలను తొలగించారు. ఈ నేపధ్యంలో కొందరు వ్యాపారులు అడ్డుకుని తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని, అయితే మరింత గడువు కావాలని ము న్సిపల్‌ అధికారులతో వాగ్వావాదానికి దిగారు. ఇదివరకే మార్కెట్‌ను నిర్వహిం చుకోవడానికి స్థలాన్ని చూపించామన్నారు. ఖాళీ చేయమని చెప్పిన పట్టిం చుకోకపోవడంతో పనులు ప్రారంభించామన్నారు. మార్కెట్‌లో తొల గింపులు ఆపమని కమిషనర్‌ తెలిపారు. మార్కెట్‌ అభివృద్ధికి వ్యాపారులు సహకరించాలని కోరారు.


Updated Date - 2021-10-22T06:01:59+05:30 IST