గరికపాడు వద్ద వాహనాల బారులు!

ABN , First Publish Date - 2020-07-02T09:44:37+05:30 IST

కేంద్రం అన్‌లాక్‌-2లో భాగంగా అంతరాష్ర్టాల మధ్య రాకపో కలకు ఇబ్బందులు లేవని చెప్పటం, హైదరాబాద్‌లో కరోనా వ్యాపిస్తుండటంతో ఏపీలోని ఆయా

గరికపాడు వద్ద వాహనాల బారులు!

జగ్గయ్యపేట రూరల్‌ : కేంద్రం అన్‌లాక్‌-2లో భాగంగా అంతరాష్ర్టాల మధ్య రాకపో కలకు ఇబ్బందులు లేవని చెప్పటం, హైదరాబాద్‌లో కరోనా వ్యాపిస్తుండటంతో ఏపీలోని ఆయా జిల్లాలకు చెందిన ప్రజలు తమ సొంత గ్రామాల బాట పట్టడంతో భారీగా వాహనాలు బారులు తీరుతున్నాయి. 


స్పందన పోర్టల్‌ ద్వారా పాసులుంటేనే అనుమతిస్తామని, అదే సమయంలో ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు మాత్రమే అనుమతిస్తామని అధికారులు అంటుండటంతో భారీగా వస్తున్న ప్రజలు ఏం చేయాలో అర్ధంకాక అధికారులను వేడుకొంటున్నారు. రాష్ర్టాల మధ్య సమన్వయలోపం సామాజిక మాధ్యమాల్లో అంతరాష్ర్టాల మధ్య రాకపోకలు సాగుతున్నాయనే వార్తలతో పాటు తెలంగాణాలో వైరస్‌ స్పందన యాప్‌లో నమోదు చేసుకున్న వారికి థర్మల్‌ స్ర్కీనింగ్‌ అనంతరమే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. నిత్యావసర, అత్యవసర వాహనాలను మాత్రం అనుమతిస్తున్నారు.   

Updated Date - 2020-07-02T09:44:37+05:30 IST