ముమ్మరంగా వాహనాల తనిఖీలు
ABN , First Publish Date - 2020-12-01T05:12:45+05:30 IST
ముమ్మరంగా వాహనాల తనిఖీలు
బూర్గంపాడు, నవంబరు 30: ఆశ్వాపురం మండల పరిధిలోని మొండికుంట గ్రామంలో సోమవారం పోలీసులు వాహన తనీఖీలు నిర్వహించారు. పీపుల్స్ వారోత్సవాల్లో భాగంగా ఆశ్వాపురం సీఐ సట్ల రాజు ఆదేశాల మేరకు ఆర్ఎ్సఐ మార్కండేయ ఆద్వర్యంలో తనీఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతి వాహనాన్ని క్షణ్ణంగా పరిశీలించి వాహనదారుల వివరాలు తెలుసుకున్నారు. తనిఖీల్లో ఆశ్వాపురం పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
మణుగూరులో...
మణుగూరు, నవంబరు 30 : మణుగూరు పట్టణంలో సోమవారం సాయంత్రం ఎస్ఐ నరేష్ వాహనాలను తనిఖీ చేశారు. పీఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. వాహనాల ధృవపత్రాలు, అనుమానితుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. తనిఖీల్లో ఎస్ఐతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.