గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-05-17T04:15:55+05:30 IST

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని తిక్కవరప్పాడు బస్‌షెల్టర్‌ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి
మృతుడు సాయికిరణ్‌ (ఫైల్‌)

వెంకటాచలం, మే 16 : గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని తిక్కవరప్పాడు బస్‌షెల్టర్‌ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరులోని బాలాజీనగర్‌ ప్రాంతానికి చెందిన కోలా సాయికిరణ్‌ (18) అనే యువకుడు మోటార్‌ బైక్‌పై సర్వేపల్లి గ్రామంలో ఉన్న తన బంధువుల ఇంటికి వెళ్తుండగా తిక్కవరప్పాడు బస్‌షెల్టర్‌ దాటిన తర్వాత గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో సాయికిరణ్‌ తలకు తీవ్రంగా గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న వెంకటాచలం ఎస్‌ఐ షేక్‌ కరీముల్లా సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి  తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2021-05-17T04:15:55+05:30 IST