బంజారాహిల్స్ ఇద్దరు వాహన దొంగల అరెస్ట్
ABN , First Publish Date - 2021-04-18T14:44:25+05:30 IST
ఆటోలు, ద్విచ్రకవాహనాలను చోరీలు చేసే ఇద్దరు దొంగలను బంజారాహిల్స్ పోలీసులు
హైదరాబాద్/బంజారాహిల్స్ : ఆటోలు, ద్విచ్రకవాహనాలను చోరీలు చేసే ఇద్దరు దొంగలను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజేంద్రనగర్కు చెందిన సయ్యద్ ఇమ్రాన్, ఆసిఫ్నగర్కు చెందిన మహ్మద్ అత్తర్ ఆటోడ్రైవర్లు. జల్సాల కోసం హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధుల్లో వాహనాల చోరీలు చేయడం మొదలుపెట్టారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్-03 గ్రీన్ మాస్కు వద్ద పార్కింగ్లో ఉన్న యమహా వాహనం చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. సయ్యద్ ఇమ్రాన్, మహ్మద్ అత్తర్ను నిందితులుగా గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. యమహా వాహనంతోపాటు రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఇమ్రాన్ గతంలో గోల్కొండ పరిధిలో చోరీ చేసి జైలుకు వెళ్లి వచ్చాడని పోలీసులు తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలించారు.