కార్యాలయంలో మసాజ్ చేయించుకున్న వీఆర్వో
ABN , First Publish Date - 2020-05-22T17:19:24+05:30 IST
కార్యాలయంలోనే మసాజ్ చేయించుకున్న ఘటన దుమారం రేపుతోంది.
కాకినాడ: కార్యాలయంలోనే మసాజ్ చేయించుకున్న ఘటన దుమారం రేపుతోంది. మహిళా వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది కార్యాలయంలో ఉండగానే వీఆర్వో భాస్కరరావు మసాజ్తో రిలాక్స్ అయ్యారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. కిర్లంపూడి మండలం, వేలంక గ్రామ సచివాలయంలో భాస్కరరావు వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నారు. ఆఫీసులో మహిళా వాలంటీర్లు, ఇతర సిబ్బంది ఉండగానే మసాజ్ చేసే వ్యక్తిని పిలిపించుకుని మసాజ్ చేయించుకున్నారు. ఈ ఘటన జరిగి రెండు రోజులు దాటింది. వీఆర్వో తీరుపై కొందరు గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరికి కలెక్టర్కు స్థానిక అధికారులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.