భక్తులతో కిక్కిరిసిన Vemulawada రాజన్న క్షేత్రం

ABN , First Publish Date - 2021-12-07T12:08:14+05:30 IST

వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దివ్యక్షేత్రం సోమవారం భక్తజనంతో కిక్కిరిసింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తజనం తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకుని

భక్తులతో కిక్కిరిసిన Vemulawada రాజన్న క్షేత్రం

రాజన్న సిరిసిల్ల: వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దివ్యక్షేత్రం సోమవారం భక్తజనంతో కిక్కిరిసింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తజనం  తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకుని తరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు  స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. స్వామివారి నిత్య కల్యాణం, కుంకుమ పూజ వంటి ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు. కల్యాణకట్టలో పెద్ద సంఖ్యలో భక్తులు తలనీలాలు సమర్పించారు. సోమవారం సందర్భంగా లఘుదర్శనం అమలు చేశారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో  స్వామివారి దర్శనానికి రెండు గంటలు, కోడెమొక్కు చెల్లింపునకు మూడు గంటలకు పైగా సమయం పట్టింది. దేవస్థానానికి అనుబంధంగా ఉన్న  బద్దిపోచమ్మ ఆలయం బోనం చెల్లించే భక్తులతో రద్దీగా మారింది.  ఆలయ ఈవో కృష్ణప్రసాద్‌ నేతృత్వంలో ఏర్పాట్లు చేశారు. 

Updated Date - 2021-12-07T12:08:14+05:30 IST