రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ
ABN , First Publish Date - 2021-08-02T05:39:04+05:30 IST
వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం ఆదివారం నాడు భక్తులతో రద్దీగా మారింది.
వేములవాడ, ఆగస్టు 1 : వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం ఆదివారం నాడు భక్తులతో రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచితరలివచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకొని తరించారు. పలువురు భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. మహాత్మాగాంధీ విశ్వ విద్యాలయం డైరెక్టర్, అకడమిక్ ఆడిట్ సెల్ డీన్ డాక్టర్ ఎం.వసంత ఆదివారం రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. నాగిరెడ్డి మండపంలో అర్చకులు స్వామివారి ప్రసాదం అందజేసి ఆశీర్వదించారు.