ముగిసిన త్రిరాత్రి ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-03-19T07:02:49+05:30 IST

వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో నిర్వహిస్తున్న త్రిరాత్రి ఉత్సవాలు శుక్రవారం రాత్రి ముగిశాయి.

ముగిసిన త్రిరాత్రి ఉత్సవాలు
డోలోత్సవం నిర్వహిస్తున్న అర్చకులు

వేములవాడ, మార్చి 18 : వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో నిర్వహిస్తున్న త్రిరాత్రి ఉత్సవాలు శుక్రవారం రాత్రి ముగిశాయి. శివకల్యాణ మహోత్సవాలకు ముందుగా మూడు రోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో భాగంగా చివరిరోజైన శుక్రవారం ఉదయం, సాయంత్రం  రాజరాజేశ్వరస్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం  స్వామివారి ఉత్సవమూర్తులను కల్యాణ మండపంలోని ఊయలలో ఉంచి డోలోత్సవం నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్‌ నేతృత్వంలో ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-19T07:02:49+05:30 IST