ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్థిల్లాలి : వెంకయ్య

ABN , First Publish Date - 2021-01-14T16:23:11+05:30 IST

అమరావతి: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రజలకు ట్విట్టర్ వేదికగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్థిల్లాలి : వెంకయ్య

అమరావతి: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రజలకు ట్విట్టర్ వేదికగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే ఈ రోజు సానుకూల మార్పునకు ప్రతీక అని పేర్కొన్నారు. ‘‘మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే ఈ రోజు సానుకూల మార్పునకు ప్రతీక.ఈ సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లోకి నవ్య కాంతులు తీసుకురావాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్థిల్లాలని ఆకాంక్షిస్తున్నాను. దివంగతులైన పెద్దలు, పూర్వీకులను, వారు చేసిన మంచి పనులు, వారి గొప్పతనాన్ని స్మరించుకుని పిల్లలకు తెలియజేసే ఈ మకర సంక్రాంతి పెద్దలకు గౌరవాన్ని ఇవ్వాలి, కుటుంబ వ్యవస్థను పటిష్టం చేసుకోవాలనే సందేశాన్నిచ్చే పండుగ. గ్రామాల్లో దీన్ని పెద్దల పండుగగా పిలుస్తారు’’ అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.


Updated Date - 2021-01-14T16:23:11+05:30 IST