అడ్డుకోవడం ఎంపీలకున్న హక్కుకాదు: ఉపరాష్ట్రపతి
ABN , First Publish Date - 2021-09-19T01:06:49+05:30 IST
అడ్డుకోవడం ఎంపీలకున్న హక్కుకాదు: ఉపరాష్ట్రపతి
ఢిల్లీ: సభాకార్యక్రమాలకు అంతరాయం కల్గించడం సభాధిక్కారమేనని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కార్యక్రమాలను అడ్డుకోవడం ఎంపీలకున్న హక్కుకాదని గ్రహించాలని సూచించారు. కొందరు చట్టసభ సభ్యుల ప్రవర్తన కారణంగా రాజ్యసభ పనితీరు 100 శాతం నుంచి 65 శాతానికి పడిపోయిందన్నారు. కులం, మతం, లింగ, సామాజిక వివక్షలను రూపుమాపాలని చెప్పారు. మహిళా సాధికారత కోసం కృషి చేయాలన్నారు.