వైభవంగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2021-02-25T04:31:18+05:30 IST

మార్కాపురం పట్టణ శివార్లలో వెలసి ఉన్న శ్రీలక్ష్మీపద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరుని 14వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా బుధవారం ముగిశాయి.

వైభవంగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
భక్తులకు శ్రీచక్ర స్నాన భాగ్యం కల్పిస్తున్న అర్చకులు

మార్కాపురం (వన్‌టౌన్‌) ఫిబ్రవరి 24: మార్కాపురం పట్టణ శివార్లలో వెలసి ఉన్న శ్రీలక్ష్మీపద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరుని 14వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా బుధవారం ముగిశాయి. అర్చకులు ఏ వీకే నరసింహాచార్యుల ఆధ్వర్యంలో వేదాంతం కల్యాణం చక్రవర్తి శివాచార్యులు ఉదయం విశ్వక్షేణ పూజ, నిత్యపూజ, మ హాశాంతి హోమం నిర్వహించారు. అనంతరం చూ ర్ణోత్సవం లక్ష్మీపద్మావతి స మేత వేంకటేశ్వరుని ఉత్సవ మూర్తులకు స్పపన తిరుమంజనం అపభృత స్నానం నిర్వహించారు. శ్రీ మహా విష్ణువు ప్రధాన ఆయుధమైన సుదర్శన చక్రానికి చక్రస్నానం నిర్వహించారు. బలిహరణ, ద్వజ అవరోహనం నిర్వహించారు. భక్తులకు శ్రీచక్ర స్నానం నిర్వహించారు. ఉభయదాతలుగా ఊటుకూరి రామకృష్ణారావు పాల్గొన్నారు. సాయంత్రం అశ్వవాహనోత్సవం నిర్వహించారు. శాశ్వత ఉభయదాతలు నాదెళ్ల సుబ్రహ్మణ్యం, నాదెళ్ల చంద్రమౌళి కుటుంబ సభ్యులు పా ల్గొన్నారు.



Updated Date - 2021-02-25T04:31:18+05:30 IST