వెంకన్నకు పవిత్రోత్సవ పూజలు

ABN , First Publish Date - 2020-12-04T04:40:24+05:30 IST

జువ్వలపాలెం రోడ్డులోని పద్మావతి వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరు గుతున్న పవిత్రోత్సవాల కార్యక్రమంలో గురువారం పూజా కార్యక్రమాలు జరిగాయి.

వెంకన్నకు పవిత్రోత్సవ పూజలు
పవిత్రాలతో ఆలయ ప్రదక్షిణ

భీమవరం టౌన్‌, డిసెంబరు 3 : జువ్వలపాలెం రోడ్డులోని పద్మావతి వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరు గుతున్న పవిత్రోత్సవాల కార్యక్రమంలో గురువారం పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆలయ ప్రధానార్చకుడు వాడపల్లి ఆదినారాయణాచార్యులు ఆ ధ్వర్యంలో ఖండవల్లి సూర్యనారాయ ణాచార్యులు (రమణబాబు) పర్యవేక్ష ణలో పూజా కార్యక్రమాలు జరిగాయి. రాయప్రోలు శ్రీనివాసమూర్తి, సూర్య పార్వతీ దంపతులు పూజా కార్యక్రమాలు చేయించారు. అగ్ని ప్రతిష్ఠాపన, వాస్తుహోమాలు, ద్వాదశ సూక్త పవిత్రాభిమంత్రణం, ప్రధాన హోమాలు, నిర్వహించారు. పవిత్రాలతో ఆలయ ప్రదక్షిణ చేయించారు. ఈవో ఆర్‌.గంగా శ్రీదేవి, ధర్మకర్త మంతెన రామ్‌కుమార్‌రాజు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T04:40:24+05:30 IST