వెంకటేశ్వర్లు సేవలు మరువలేనివి

ABN , First Publish Date - 2021-06-24T07:00:03+05:30 IST

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌గా వెంకటేశ్వర్లు చేసిన సేవలు మరువలేనివని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ అన్నారు.

వెంకటేశ్వర్లు సేవలు మరువలేనివి
వీడ్కోలు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్‌

జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ

నిర్మల్‌ టౌన్‌, జూన్‌ 23 : జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌గా వెంకటేశ్వర్లు చేసిన సేవలు మరువలేనివని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ అన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టర్‌ కార్యాల య సమావేశం మందిరంలో పీడీ వెంకటేశ్వర్లు మా తృశాఖకు (వ్యవసాయశాఖ) బదిలీ అయిన సంద ర్భంగా నిర్వహించిన వీడ్కోలు సన్మాన కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌లు హేమంత్‌బోర్కడే, రాంబాబులతో కలిసి కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ  సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ విధి నిర్వహణలో అంకిత భావం, క్రమశిక్షణతో వెంకటేశ్వర్లు సేవలందించారని కొనియాడారు. తోటి అధికారులు ఆయనను స్ఫూర్తి గా తీసుకొని పనిచేయాలని సూచించారు. జిల్లా ఇన్‌చార్జి గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌గా జడ్పీ సీఈవో సుధీర్‌ బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు అంజి ప్రసాద్‌, రాథోడ్‌ రమేష్‌, శరత్‌ కుమార్‌, ప్రణీత, స్రవంతి, రమేష్‌కుమార్‌, శ్రీనివాస్‌రెడ్డి, రాజేశ్వర్‌, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-24T07:00:03+05:30 IST