వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ABN , First Publish Date - 2021-02-25T03:58:22+05:30 IST
మండల కేంద్రంలో వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి.
పెంట్లవెల్లి, ఫిబ్రవరి 24: మండల కేంద్రంలో వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామి వారి బ్రహ్మోత్సవాలకు అంకుర్పారణ, మహా సుద ర్శన హోమం, కుంభ మంగళహారతి, గణపతి పూజ కార్యక్రమాలు జరిగాయి. గురువారం స్వామి కల్యాణం, శుక్రవారం నవగ్రహాల హోమం, స్వామి వారి పల్లకి సేవా కార్యక్రమాలు చేపట్టను న్నారు. శ్రీవారి రథోత్సవం శనివారం సాయంత్రం ఉంటుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు క లుగకుండా అన్నిచర్యలు తీసుకుంటున్నట్లు బ్రహ్మోత్సవాల నిర్వాహక కమిటీ సభ్యులు తెలిపారు.
- బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం వాలీబాల్ పోటీలను న్యాయమూర్తి జీవన్కుమార్, జిల్లా కో ఆప్షన్ సభ్యుడు మతీన్ ప్రారంభించారు. సర్పంచ్ సువర్ణమ్మ, టీఆర్ఎస్ యూత్ నా యకులు మోబిన్, కురుమూర్తి, గోపి, రాము తదితరులున్నారు.