కమనీయం.. వేంకటేశ్వరస్వామి కల్యాణం
ABN , First Publish Date - 2021-10-28T04:56:08+05:30 IST
పెంటపాడు ఆర్యవైశ్య కల్యాణ మండపంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాన్ని భాష్యం వెంకటరామ శేషభట్టర్ బ్రహ్మత్వంలో బుధవారం కమనీయంగా నిర్వహించారు.
పెంటపాడు, అక్టోబరు, 27 : పెంటపాడు ఆర్యవైశ్య కల్యాణ మండపంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాన్ని భాష్యం వెంకటరామ శేషభట్టర్ బ్రహ్మత్వంలో బుధవారం కమనీయంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన పసుమర్తి శశిధర్(తాతాజీ), విజయలక్ష్మి, పసుమర్తి వెంకటరమణమూర్తి, చంద్రరేఖ దంపతులు పీఠలపై కూర్చుని పూజలు నిర్వహించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి బొలిశెట్టి శ్రీనివాస్ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నసమారాధన నిర్వహించారు. జనసేన నాయకులు వర్తనపల్లి కాశీ, కొనకళ్ళ హరినాఽథ్, పుల్లా బాబి, ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షుడు పసుపర్తి రాజు, గౌరవ కార్యదర్శి కొనకళ్ళ నాగమురళి, అధ్యక్షుడు వంకాయల ఆదినారాయణ, కార్యదర్శి తమ్మన శ్రీనివాస్, కమిటీ సభ్యులు పసుమర్తి రాము, వంకాయల ప్రసాద్ పాల్గొన్నారు.