ప్రభుత్వ జీవోలకు వ్యతిరేకంగా కలిసి పనిచేస్తున్నాం: వెంకట్రామిరెడ్డి

ABN , First Publish Date - 2022-01-22T01:06:30+05:30 IST

ప్రభుత్వ జీవోలకు వ్యతిరేకంగా కలిసి పనిచేస్తున్నామని సచివాలయ ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామిరెడ్డి తెలిపారు.

ప్రభుత్వ జీవోలకు వ్యతిరేకంగా కలిసి పనిచేస్తున్నాం: వెంకట్రామిరెడ్డి

అమరావతి: ప్రభుత్వ జీవోలకు వ్యతిరేకంగా కలిసి పనిచేస్తున్నామని సచివాలయ ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలనేది తమ మొదటి డిమాండ్ అని చెప్పారు. అశుతోష్‌ మిశ్రా కమిటీ రిపోర్ట్ ఇవ్వాలని కోరుతున్నామని తెలిపారు. ఈ నెల పాత జీతాలనే చెల్లించాలని సీఎస్‌ను కోరామని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సూర్యనారాయణ తెలిపారు. "పీఆర్సీ సాధన సమితి" పేరుతో కలిసి పోరాడుతామని ప్రకటించారు. 12 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని, తమకు మద్దతు పలకాలని టీడీపీ అధినేత చంద్రబాబును కోరలేదన్నారు. తాము ఏ రాజకీయ పార్టీ మద్దతు కోరుకోవడం లేదని సూర్యనారాయణ పేర్కొన్నారు. 


Updated Date - 2022-01-22T01:06:30+05:30 IST