దేవాలయల ఆస్తుల విచారణపై స్పందించిన బొబ్బిలి రాజ వంశీయులు
ABN , First Publish Date - 2021-06-11T21:05:47+05:30 IST
బొబ్బిలి రాజ వంశీయుల ఆరాధ్యదైవమైన వేణుగోపాలస్వామి వారి ఆస్తులపై విచారణకు..
విజయనగరం జిల్లా: బొబ్బిలి రాజ వంశీయుల ఆరాధ్యదైవమైన వేణుగోపాలస్వామి వారి ఆస్తులపై విచారణకు ఆదేశిస్తూ.. మంత్రులు బొత్స సత్యానారాయణ, వెల్లంపల్లి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలను తాము స్వాగతిస్తున్నామని బొబ్బిలి రాజవంశీయులు బేబి నాయన అన్నారు. దేవాదాయ శాఖ అధికారులు స్వామివారి స్థిరచరాస్తులపై విచారించడం తప్పుకాదన్నారు. తమ పూర్వీకులు దేవస్థానాల కోసం దానం చేసిన 4వేల ఎకరాలపై సర్వే నిర్వహించి హద్దుల ఏర్పాటుకు ప్రభుత్వం, దేవాదాయశాఖ సహకరించాలని కోరుతున్నామని అన్నారు.