పెళ్లయిన మూడు నెలలకే..

ABN , First Publish Date - 2020-08-13T13:16:59+05:30 IST

వేపగుంట దరి అప్పన్నపాలెంలో పెళ్లయిన మూడు నెలలకే..

పెళ్లయిన మూడు నెలలకే..

వేపగుంట(విశాఖపట్నం): వేపగుంట దరి అప్పన్నపాలెంలో పెళ్లయిన మూడు నెలలకే ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పన్నపాలెంలో కొమ్మాన అప్పన్న, అప్పాయమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరు కూలినాలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కొడుకు, కూతురు ఉన్నారు. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న కొడుకు హరీశ్‌(19)కు ఈ ఏడాది మే నెలలో శ్రీకాకుళానికి చెందిన లక్ష్మితో వివాహమైంది. ప్రస్తుతం ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్లడంతో కోడలిని తీసుకురావడానికి అత్త అప్పాయమ్మ బుధవారం శ్రీకాకుళం వెళ్లింది.


బయటకు వెళ్లిన తండ్రి పనులు ముగించుకొని 11 గంటల సమయంలో ఇంటికి రాగా, ఎంత పిలిచినా తలుపులు తీయలేదు. దీంతో కిటికీలో నుంచి చూడగా ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. పెందుర్తి పోలీసులకు సమాచారం అందించగా, సంఘటనా స్థలిని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.


Updated Date - 2020-08-13T13:16:59+05:30 IST