ప్రశాంతంగా డీఎస్సీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌

ABN , First Publish Date - 2020-09-25T11:20:57+05:30 IST

డీఎస్సీ 2018 రెండో ఫేజ్‌లో ఎంపికైన ఎస్‌జీటీ తెలుగు అభ్యర్థులకు గురువారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రశాంతంగా

ప్రశాంతంగా డీఎస్సీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌

14 మంది హాజరు


కడప (ఎడ్యుకేషన్‌), సెప్టెంబరు 24: డీఎస్సీ 2018 రెండో ఫేజ్‌లో ఎంపికైన ఎస్‌జీటీ తెలుగు అభ్యర్థులకు గురువారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రశాంతంగా జరిగింది. ఈ వెరిఫికేషన్‌ ప్రక్రియకు జిల్లా వ్యాప్తంగా 18 మంది హాజరు కావాల్సి ఉండగా 14 మంది అభ్యర్థులు మాత్రమే వచ్చారు. ఐదుగురు అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ఎంపికైన అభ్యర్థులకు శుక్రవారం కౌన్సెలింగ్‌ ఉంటుందని జిల్లా విద్యాశాఖాధికారి శైలజ తెలిపారు. అభ్యర్థులు పది పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలతో హాజరు కావాలన్నారు. కౌన్సెలింగ్‌ అనంతరం వారికి శుక్రవారమే నియామక పత్రాలు అందిస్తామని తెలిపారు.

Updated Date - 2020-09-25T11:20:57+05:30 IST