మిశ్రా స్థానంలో ప్రవీణ్ దూబే
ABN , First Publish Date - 2020-10-20T08:52:48+05:30 IST
వేలి గాయం కారణంగా ఐపీఎల్ మొత్తానికి దూరమైన ఢిల్లీ క్యాపిటల్స్ వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా స్థానంలో..
దుబాయ్: వేలి గాయం కారణంగా ఐపీఎల్ మొత్తానికి దూరమైన ఢిల్లీ క్యాపిటల్స్ వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా స్థానంలో కర్ణాటక లెగ్ స్పిన్నర్ ప్రవీణ్ దూబే జట్టులోకి వచ్చాడు. ఈ మేరకు మిశ్రాకు బదులుగా ప్రవీణ్ను తీసుకున్నట్టు ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం సోమవారం ట్విటర్లో ప్రకటించింది. 27 ఏళ్ల ప్రవీణ్ దేశవాళీల్లో 14 టీ20 మ్యాచ్లాడి 16 వికెట్లు పడగొట్టాడు.