చైనాకు రాజ్‌నాథ్ పరోక్ష హెచ్చరిక

ABN , First Publish Date - 2021-01-15T01:32:58+05:30 IST

బెంగళూరు: భారత్ యుద్ధం కోరుకోదని అయితే భారత సార్వభౌమత్వాన్ని ఎవరైనా దెబ్బతీయాలని చూస్తే సైన్యం తగినరీతిలో జవాబు చెబుతుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు.

చైనాకు రాజ్‌నాథ్ పరోక్ష హెచ్చరిక

బెంగళూరు: భారత్ యుద్ధం కోరుకోదని అయితే భారత సార్వభౌమత్వాన్ని ఎవరైనా దెబ్బతీయాలని చూస్తే సైన్యం తగినరీతిలో జవాబు చెబుతుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. ఏ సూపర్ పవర్ అయినా భారత ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తే ధీటుగా సమాధానం చెప్పేందుకు సైనికులు సిద్ధంగా ఉన్నరని పరోక్షంగా చైనాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బెంగళూరులో జరిగిన ఆర్మ్‌డ్ ఫోర్సెస్ వెటరన్స్ డే సందర్భంగా ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చుట్టుపక్కల దేశాలతో భారత్ ఎల్లప్పుడూ శాంతియుత సంబంధాలే కోరుకుంటుందని చెప్పారు. పొరుగుదేశాలతో సత్సంబంధాలు కోరుకోవడం భారత్ రక్తం, సంస్కృతిలోనే ఉందన్నారు. లడక్‌లో సైనికుల చూపిన తెగువను రాజ్‌నాథ్ కొనియాడారు. దేశ ప్రజలంతా గర్వించేలా ధైర్యసాహసాలు ప్రదర్శించారని కీర్తించారు. చైనాతో సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్న తరుణంలో రాజ్‌నాథ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. 

Updated Date - 2021-01-15T01:32:58+05:30 IST