దివ్యాంగుడి మృతిపై చర్యలేవి?

ABN , First Publish Date - 2021-10-23T08:18:47+05:30 IST

దివ్యాంగుడు కార్తీక్‌గౌడ్‌ మృతికి కారకులైన పోలీస్‌ సిబ్బందిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి(వీహెచ్‌పీఎ్‌స) జాతీయ అధ్యక్షుడు గోపాల్‌రాజు, రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం ఖాసిం డిమాండ్‌ చేశారు.

దివ్యాంగుడి మృతిపై చర్యలేవి?

  • యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌ ఎదుట వీహెచ్‌పీఎస్  ధర్నా


యాదాద్రి రూరల్‌, అక్టోబరు 22: దివ్యాంగుడు కార్తీక్‌గౌడ్‌ మృతికి కారకులైన పోలీస్‌ సిబ్బందిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి(వీహెచ్‌పీఎ్‌స) జాతీయ అధ్యక్షుడు గోపాల్‌రాజు, రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం ఖాసిం డిమాండ్‌ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పోలీస్‌ స్టేషన్‌ ఎదుట శుక్రవారం నిర్వహించిన ధర్నాలో వారు మాట్లాడుతూ కార్తీక్‌గౌడ్‌ పోలీసుల దాడిలో మృతి చెంది ఐదు రోజులు అవుతున్నా బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. 24వ తేదీలోగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీఐ నర్సయ్య హామీ ఇవ్వటంతో వారు ధర్నా విరమించారు. 

Updated Date - 2021-10-23T08:18:47+05:30 IST