అల్పాదాయ వర్గాలకు వీఐ ఉచిత ప్లాన్
ABN , First Publish Date - 2021-05-19T05:54:53+05:30 IST
ప్రస్తుత కరోనా ఉధృతి కారణంగా ఏర్పడిన ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వీఐ అల్పాదాయ వర్గాల కస్టమర్లకు రూ.49 ఉచిత రీచార్జి సదుపాయం కల్పించింది
న్యూఢిల్లీ: ప్రస్తుత కరోనా ఉధృతి కారణంగా ఏర్పడిన ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వీఐ అల్పాదాయ వర్గాల కస్టమర్లకు రూ.49 ఉచిత రీచార్జి సదుపాయం కల్పించింది. మహమ్మారి కారణం గా ఏర్పడిన అసాధారణ వాతావరణంలో నిరంతర అనుసంధానత కల్పించడం కోసం ప్రకటించిన ఈ ఆఫర్ కింద రూ.38 విలువ గల ఉచిత టాక్టైమ్, 100 ఎంబీ ఉచిత డేటా అందుబాటులో ఉంటాయి. ఈ ఉచిత రీచార్జి కాలపరిమితి 28 రోజులు. ఈ ఆఫర్ ఒక్కసారి మాత్రమే వర్తిస్తుందని వీఐ తెలిపింది. అలాగే 28 రోజుల కాలపరిమితి గల రూ.79 కాంబో వోచర్ను కూడా వీఐ ప్రవేశపెట్టింది. దీన్ని రీచార్జ్ చేసుకున్న కస్టమర్లకు రూ.128 టాక్ టైమ్ (64+64), 200 ఎంబీ డేటా అందుబాటులో ఉంటాయి.