వైభవంగా అయ్యప్ప పడిపూజ
ABN , First Publish Date - 2021-12-07T03:29:37+05:30 IST
పల్లెపాడులోని మీనాక్షి సమేత రామేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని అయ్యప్ప ఆలయంలో సోమవారం విశేష పూజలు నిర్వహించారు. ఉద
ఇందుకూరుపేట, డిసెంబరు6 : పల్లెపాడులోని మీనాక్షి సమేత రామేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని అయ్యప్ప ఆలయంలో సోమవారం విశేష పూజలు నిర్వహించారు. ఉదయం అభిషేకాలు, సాయంత్రం మెట్లను అలంకరించి, పడిపూజ చేశారు. శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప సేవా సంఘం గురుస్వాములు శీనయ్య స్వామి, హరి స్వామి, మురళీ స్వామి ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించారు.