రేపు నెల్లూరు జిల్లాకు ఉపరాష్ట్రపతి

ABN , First Publish Date - 2021-11-12T02:18:22+05:30 IST

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం వెంకటాచలానికి రానున్నారు. ఆయన ఈనెల 12, 13, 14వ తేదీల్లో వివిధ

రేపు నెల్లూరు జిల్లాకు ఉపరాష్ట్రపతి

నెల్లూరు: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం వెంకటాచలానికి రానున్నారు. ఆయన ఈనెల 12, 13, 14వ తేదీల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. వెంకయ్యనాయుడు పర్యటన కావడంతో పోలీసులు, కేంద్ర బలగాలు వెంకటాచలాన్ని జల్లెడ పడుతున్నారు. డాగ్‌, బాంబ్‌ స్క్వాడ్‌ బృందాలు జాతీయ రహదారితోపాటు వెంకయ్యనాయుడు పర్యటించనున్న ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేశారు. స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ నుంచి అక్షర విద్యాలయం వరకు జాతీయ రహదారిపై అడుగడుగునా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వెంకయ్యనాయుడు బస చేయనున్న స్వర్ణభారత్‌ ట్రస్ట్‌, పర్యటించనున్న అక్షర విద్యాలయం, దివ్యాంగుల నైపుణ్యా భివృద్ధి కేంద్రం, కౌసల్యాసదనం, సోమశిక్షణా కేంద్రం, పర్ణశాల, హెలిప్యాడ్‌, వెంకటాచలం రైల్వే స్టేషన్‌లను ఇప్పటికే పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఈప్రాంతాల్లో భారీ పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. 

Updated Date - 2021-11-12T02:18:22+05:30 IST