గుడారు లక్ష్మయ్య మృతి పట్ల ఉపరాష్ట్రపతి సంతాపం
ABN , First Publish Date - 2020-09-30T00:00:13+05:30 IST
బర్డ్ పూర్వ సంచాలకులు డాక్టర్ గుడారు జగదీష్ తండ్రి గుడారు లక్ష్మయ్య నాయుడు(85) మరణం పట్ల ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సంతాపం ప్రకటించారు.
చిత్తూరు : బర్డ్ పూర్వ సంచాలకులు డాక్టర్ గుడారు జగదీష్ తండ్రి గుడారు లక్ష్మయ్య నాయుడు(85) మరణం పట్ల ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. మానవీయ విలువలు గల మంచి మనిషిగా లక్ష్మయ్య నాయుడు గారిని ప్రతి ఒక్కరూ అభిమానించే వారని ఆయన అభిప్రాయపడ్డారు.
మంగళవారం లేఖ రూపంలో డాక్టర్ జగదీష్కు ఆయన తన సంతాప సందేశం పంపించారు. స్వతహాగా రైతు అయిన లక్ష్మయ్య అంచెలంచెలుగా ఎదిగి ప్రముఖ ఎరువుల కంపెనీలకు చిత్తూరు జిల్లా డీలర్గా వ్యవహరించారు. రాయలసీమ రైతాంగం, ఎరువుల కంపెనీలతో ఆయన సత్సంబంధాలు కలిగి ఉన్నారు. ఎరువుల నాయుడు గా రైతుల అభిమానం చూరగొన్న ఆయన మృతి పట్ల రైతులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.