దేశ పురోగతికి యువత పాటుపడాలి

ABN , First Publish Date - 2021-01-18T07:09:01+05:30 IST

దేశ పురోభివృద్ధికి యువత పాటుపడాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌ మేనకోడలు నజీమా

దేశ పురోగతికి యువత పాటుపడాలి

ఉపరాష్ట్రపతి వెంకయ్య 


చెన్నై, జనవరి 17 (ఆంధ్రజ్యోతి):  దేశ పురోభివృద్ధికి యువత పాటుపడాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌  మేనకోడలు నజీమా మరైకాయర్‌ రచించిన ‘అబ్తుల్‌ కలామ్‌ అమరజ్ఞాపకాలు’ అనే తమిళ పుస్తకాన్ని ఆయన  తమిళనాడు రాజ్‌భవన్‌లో ఆదివారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా  ప్రసంగిస్తూ ప్రజల రాష్ట్రపతిగా కీర్తిని పొందిన అబ్దుల్‌ కలామ్‌ జీవిత చరిత్ర యువతకు స్పూర్తినిస్తుందన్నారు. యువకులు ఉద్యోగాల కోసం వెంపర్లాడటం కన్నా ఉద్యోగ సృష్టికర్తలుగా మారాలన్నారు.  దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు పాలకులను, శాస్త్రవేత్తలను తాను మనసారా అభినందిస్తున్నానని వెంకయ్యనాయుడు చెప్పారు. ’

Updated Date - 2021-01-18T07:09:01+05:30 IST