శ్రీవారి సేవలో వెంకయ్య దంపతులు

ABN , First Publish Date - 2021-03-06T09:35:15+05:30 IST

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుక్రవారం కుటుంబసమేతంగా దర్శించుకున్నారు.

శ్రీవారి సేవలో వెంకయ్య దంపతులు

తిరుమల, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు  శుక్రవారం కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఉదయం నిజపాదసేవ సమయంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామితో కలిసి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ ద్వారా మహాద్వారం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. అనంతరం ఉపరాష్ట్రపతి  శ్రీవారిని దర్శించుకున్నారు. తర్వాత రంగనాయక మండపంలో వేదపండితులు ఆయనకు ఆశీర్వచనం, అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. 

Updated Date - 2021-03-06T09:35:15+05:30 IST