ఆడ్వాణీ నుంచి ఎంతో నేర్చుకున్నా

ABN , First Publish Date - 2020-07-05T07:41:59+05:30 IST

తన రాజకీయ జీవితం తొలినాళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో తెన్నేటి విశ్వనాథం, జాతీయ స్థాయిలో లాల్‌ కృష్ణ ఆడ్వాణీ నుంచి ఎంతో నేర్చుకున్నానని ఉపరాష్ట్రపతి...

ఆడ్వాణీ నుంచి ఎంతో నేర్చుకున్నా

గురుపూర్ణిమ సందర్భంగా ‘ఫేస్‌బుక్‌’లో ఉప రాష్ట్రపతి 


న్యూఢిల్లీ, జులై 4(ఆంధ్రజ్యోతి): తన రాజకీయ జీవితం తొలినాళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో తెన్నేటి విశ్వనాథం, జాతీయ స్థాయిలో లాల్‌ కృష్ణ ఆడ్వాణీ నుంచి ఎంతో నేర్చుకున్నానని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. గురుపూర్ణిమ సందర్భంగా శనివారం ఆయన ‘ఫేస్‌ బుక్‌’ ద్వారా తన గురువులను స్మరించుకున్నారు. తల్లిదండ్రుల తర్వాత భగవంతుడి కంటే గురువుకే భారతీయులు ప్రాధాన్యం కల్పించి గౌరవించారని పేర్కొన్నారు. 15 నెలల వయసులోనే తల్లిని కోల్పోయిన తనకు అమ్మమ్మ శేషమ్మ, తాత నరసయ్యనాయుడు గురువులుగా నిలిచారని తెలిపారు. పాఠశాల నుంచి యూనివర్సిటీ వరకూ తన గురువులను పేర్లతో సహా ప్రస్తావించి స్మరించుకున్నారు. తనను ప్రజాసేవ దిశగా పురి కొల్పిన సంఘ్‌ పెద్దలు సోంపల్లి సోమయ్య, భోగాది దుర్గాప్రసాద్‌ తనలో నాయకత్వ లక్షణాలకు సాన పెట్టారని తెలిపారు. 

Updated Date - 2020-07-05T07:41:59+05:30 IST