యోగా సాధనలో ఉపరాష్ట్రపతి దంపతులు

ABN , First Publish Date - 2021-06-21T13:51:06+05:30 IST

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి ముప్పరవపు వెంకయ్యనాయుడు, సతీమణి ఉషమ్మతో కలిసి సోమవారం ఉపరాష్ట్రపతి నివాసంలో యోగా సాధన చేశారు.

యోగా సాధనలో ఉపరాష్ట్రపతి దంపతులు

న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి ముప్పరవపు వెంకయ్యనాయుడు, సతీమణి ఉషమ్మతో కలిసి సోమవారం ఉపరాష్ట్రపతి నివాసంలో యోగా సాధన చేశారు. ‘యోగాతో సంపూర్ణ ఆరోగ్యం’ అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్న ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాభ్యాసం చేయాలన్నారు. శారీరక ఆరోగ్యం, మానసిక సంతులనాన్ని పెంపొందించుకునేందుకు యోగా ఎంతగానో ఉపయుక్తం అవుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు.

Updated Date - 2021-06-21T13:51:06+05:30 IST