గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న ఉపరాష్ట్రపతి Venkaiah
ABN , First Publish Date - 2021-10-30T17:25:55+05:30 IST
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.
విజయవాడ: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వెంకయ్యకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్,మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక దళాలతో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి గౌరవ వందనం సమర్పించారు. గన్నవరం విమానాశ్రయం నుండి వెంకయ్యనాయుడు ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్కి బయలుదేరి వెళ్లారు. నాలుగు రోజులు పాటు జిల్లాలో పలు కార్యక్రమాల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొననున్నారు.