ఇది ఇస్లాం సాధించిన విజయం: పాకిస్థాన్ మంత్రి
ABN , First Publish Date - 2021-10-25T22:10:50+05:30 IST
టీ20 ప్రపంచకప్లో భాగంగా భారత్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో పాక్ ఘన విజయం సాధించడంపై
ఇస్లామాబాద్: టీ20 ప్రపంచకప్లో భాగంగా భారత్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో పాక్ ఘన విజయం సాధించడంపై ఆ దేశ అంతర్గత శాఖ మంత్రి షేక్ రషీద్ స్పందించారు. ఇది ఇస్లాం సాధించిన విజయంగా అభివర్ణించారు. ఈ మ్యాచ్లో పాక్ విజయం సాధించాలని భారత్లో ఉన్న ముస్లింలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరూ కోరుకున్నారని అన్నారు.
‘‘భారత జట్టుపై పాకిస్థాన్ సాధించిన విజయం ‘ఇస్లాం విజయం’. ఈ గెలుపుతో ముస్లింలందరూ సంతోషంగా ఉన్నారు’’ అని పేర్కొన్న వీడియో ట్విట్టర్లో తిరుగుతోంది. ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ తమకు ఫైనల్ లాంటిందని మంత్రి పేర్కొన్నారు. అయితే, ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. క్రీడలను మతంతో ముడిపెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పాకిస్థాన్ జట్టు ఏళ్ల తర్వాత భారత్పై గెలిచిందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని మంత్రికి సూచిస్తున్నారు.