కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్

ABN , First Publish Date - 2020-03-30T21:10:03+05:30 IST

కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైరస్ సోకిన వారిని ఆస్పత్రికి తీసుకురావాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని సీఎం ఆదేశించారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్‌లో తీసుకున్న

కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్

అమరావతి: కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైరస్ సోకిన వారిని ఆస్పత్రికి తీసుకురావాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని సీఎం ఆదేశించారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్‌లో తీసుకున్న వివరాలను మంత్రి కన్నబాబు మీడియాతో వివరించారు. వ్యవసాయ ఉత్పత్తుల ట్రాన్స్‌పోర్టుపై ఎలాంటి ఆంక్షలు లేవని, ఒంటి గంట వరకు వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు అనుమతిస్తామని తెలిపారు. శానిటేషన్ సిబ్బందికి మాస్కులు అందించాలని, రేషన్‌షాపుల వద్ద దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అగ్రికల్చర్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు పనిచేస్తాయని, నిత్యావసరాలను అధిక ధరలకు అమ్మితే జైలుకు పంపుతామని మంత్రి హెచ్చరించారు. రేషన్‌ షాపులను వికేంద్రీకరించాలని సీఎం ఆదేశించారని, నియోజకవర్గ స్ధాయిలో కూడా కరోనా మానిటరింగ్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. వృద్ధాశ్రమాలు, అనాధ ఆశ్రమాలకు ఉచితంగా బియ్యం, కందిపప్పు ఇవ్వాలని కన్నబాబు ఆదేశించారు.

Updated Date - 2020-03-30T21:10:03+05:30 IST